calender_icon.png 16 June, 2025 | 9:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రమంత్రి బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట

16-06-2025 02:00:52 PM

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో(Telangana high courtమాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుకేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay)కి ఊరట లభించింది. బండి సంజయ్ పై నమోదైన కేసును హైకోర్టు సోమవారం కొట్టివేసింది. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్ లో బండి సంజయ్ పై కేసు నమోదైంది. 2021 నవంబర్ 15న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బండి సంజయ్ ర్యాలీ నిర్వహించారు. అనుమతి లేకుండా కాన్వాయ్ నిర్వహించారని ఎన్నికల అధికారి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు బండి సంజయ్ పై పెన్ పహాడ్ పోలీసులు(Penpahad Police Station) కేసు నమోదు చేశారు. ఈ కేసు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో పెండింగ్ లో ఉంది. తాజాగా విచారణ చేపట్టిన ధర్మాసనం బండి సంజయ్ పై కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.