16-06-2025 01:55:13 PM
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి శాంతిఖని వద్ద యోగా డే సందర్భంగా 6 రోజుల పాటు యోగా బూట్ క్యాంప్ ను నిర్వహించారు. సోమవారం యోగ క్యాంపును శాంతి ఖని డీవై సూపరిడెంట్, ప్రత్యేక యోగ నిపుణులు శ్రీనివాసరాజు ప్రారంభించారు. యోగ శిక్షణ కార్యక్రమoలో శాంతిగని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా, ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ దాసరి తిరుపతి గౌడ్, అధికారులు, ఉద్యోగులు, కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు.