05-06-2025 12:00:00 AM
తుంగతుర్తి, జూన్ 4 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతితో రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని తుంగతుర్తి తాసిల్దార్ దయానంద్ అన్నారు బుధవారం మండల పరిధిలోని మానాపురం ఏనకుంట తండా కరివిరాల కొత్తగూడెం గ్రామాలలో భూభారతి సదస్సుల నిర్వహించారు.
రైతులు తమ సమస్యలను భూభారతి పేపర్లో నింపి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ సమస్యలను భూభారతి సదస్సులో పొందుపర చుకొని, పరిష్కరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.