calender_icon.png 6 June, 2025 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరోసారి ఇథనాల్ ఫ్యాక్టరీ అలజడి.. తిరగబడ్డ రైతులు

04-06-2025 11:43:15 AM

  1. ఇథనాల్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతుల ఆందోళన
  2. రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఉద్రిక్తత
  3. జోగులాంబ గద్వాల్ జిల్లాలో మరోసారి ఇథనాల్ ఫ్యాక్టరీ అలజడి

హైదరాబాద్: జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal) రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇథనాల్ కంపెనీ(Ethanol Company) ఏర్పాటుకు వ్యతిరేకిస్తూ రైతులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. గాయత్రి ఇథనాల్ కంపెనీ(Gayatri Ethanol Company)కి చెందిన కార్లు, టెంట్లను రైతులు ధ్వంసం చేశారు. పరిశ్రమకు చెందిన టెంట్లు, కంటైనర్ డబ్బాలకు నిప్పుపెట్టారు. కంపెనీ నిర్మాణ పనులు చేస్తున్న కూలీలను తరిమేశారు. ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. రైతులు భారీ సంఖ్యలో ఉండటంతో పోలీసులు నిలువరించలేకపోయారు. మా భూములే లాక్కుంటారా అంటూ కడుపు మండి రైతులు తిరగబడ్డారు. గతంలో పనులు నిలిపివేస్తామని ప్రభుత్వం చెప్పింది. కంపెనీ యాజమాన్యం మరోసారి పనులు ప్రారంభించింది. దీంతో ఆందోళనకు దిగిన రైతులు, స్థానిక ప్రజలు వాహనాలు తగలబెట్టారు. కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పది గ్రామాల ప్రజలు నిరసనకు దిగారు.