20-05-2025 12:07:41 AM
జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్
కామారెడ్డి, మే 19 ( విజయక్రాంతి), ఆయిల్ ఫామ్ సాగు చేస్తూ రైతులు అధిక లాభాలు పొందాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆసీస్ సంగు వాన్ అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం యాడ వరం గ్రామంలో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుల సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన ఆయిల్ ఫామ్ సాగుపై రైతులు అవగాహన కల్పించుకొని, సాగుచేస్తూ మంచి దిగుబడులు సాధించాలని కలెక్టర్ అన్నారు.
కలెక్టర్ జిల్లాలోని రైతులు వరి పంట కు బదులు ఆయిల్ పామ్ సాగుచేసి అధిక దిగుబడి తో పాటు అధిక లాభాలు బొందవచ్చని తెలిపారు. ఆయిల్ పామ్ సాగులో లేబర్ ఖర్చు తక్కువ, డ్రిప్ ఇరిగేషన్ తో సాగుచేయవచ్చని, దిగుబడి ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారిని జ్యోతి ఉద్యాన శాఖ ద్వారా ఆయిల్ ఫామ్ కు ఒక ఎకరానికి 4200 సబ్సిడీ రూపంలో నాలుగు సంవత్సరాల అందజేయడం జరుగుతుందనీ తెలిపారు.
డ్రిప్పు కూడా SC ,ST రైతులకు 100%, చిన్న , సన్నకారు రైతులకు 90%, పెద్ద రైతులకు 80% సబ్సిడీలో ఇవ్వడం జరుగుతుందని వివరించారు. హిందుస్థాన్ యూనిలీవర్ మల్టీ నేషనల్ కంపెనీ అధికారులు వరుణ్, విజయ రామస్వామి మాట్లాడుతూ కచ్చితంగా కామారెడ్డి జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మించడానికి కసరత్తు చేస్తున్నామని తెలిపారు, రైతులు ఆయిల్ పామ్ సాగు చేసుకుని అధిక లాభాలు సాధించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, హిందూస్తాన్ కంపెనీ ప్రతినిధులు, పాల్గొన్నారు.