30-06-2025 12:00:00 AM
ఖమ్మం, జూన్ 29, (విజయ క్రాంతి): ఈ లెక్కలు విచిత్రంగా అనిపించవచ్చు...... కానీ ఇవి వాస్తవాలు.... జిల్లాలోని 50 ప్రభుత్వ ప్రైమరి పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరానికి (2025-26) ఒక్క విద్యార్థి కూడా జాయిన్ కాలేదు...... 90 పైన పాఠశాలల్లో 0 నుండి 9 మంది మాత్రమే విద్యార్థులున్నారు.
ఇదీ ఖమ్మం జిల్లాలో ని ప్రభుత్వ ప్రై మరీ పాఠశాలల పరిస్థితి....బడి బాట లాంటి కార్యక్రమాలు చేపట్టి, అధికారులు విద్యార్థులను జాయిన్ చేసుకొనే ప్రయత్నం చేసి నప్పటికి ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపేందుకు మక్కువ చూపెట్టడము లేరు. కారణా లు ఏమైనా ప్రభుత్వ ప్రైమరీ స్కూల్స్ లో జాయిన్ అయ్యే విద్యార్థుల సంఖ్య అంతం త మాత్రం గానే వుంది.
వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా లో 857 ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలు వున్నవి. వీటిలో ఈ నెల 27 వ తేదీ నాటికీ, 50 ప్రైమరీ స్కూల్స్ లో ఒక్క విద్యార్థి కూడా జా యిన్ కాలేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. దాదాపు 99 పాఠశాలల్లో సింగల్ డిజిట్ లో (0-9) విద్యార్థులు మాత్రమే జాయిన్ అయ్యారు. వీటిలో ఒక్క విద్యార్థి కూడా జాయిన్ కా నీ పాఠశాలలు - 50 కాగా, ఒకే ఒక్క విద్యార్థి వున్న పాఠశాలలు - 2,
ఇద్దరు విద్యార్థులున్న పాఠశాలలు - 9, ముగ్గురు విద్యార్థులున్న పాఠశాలలు-6, నలుగురు విద్యార్థులున్న పాఠశాలలు- 6, ఐదు గురు విద్యార్థులున్న పాఠశాలలు - 9 ఈ విదంగా 0 నుండి 9 మంది వున్న పాఠశాలలు మొత్తం 99 వున్నవి.ఇదే జిల్లాలోని ఏ ప్రైవేట్ పాఠశాలలలో కూడా సింగిల్ డిజిట్ లో విద్యార్థులు లేరుజిల్లాలోని ఏ ప్రైవేటు పాఠశాలలో కూడా సింగిల్ డిజిట్ సంఖ్య తో విద్యార్థులు లేరు.
కానీ ప్రభుత్వ పాఠశాలలు మాత్రం అనేకం. ప్రభుత్వ పాఠశాల పక్కన ఒక చిన్న ప్రైవేట్ పాఠశాల వుండి అక్కడ డిగ్రీ చదివిన టీచర్లు మాత్రమే వు న్న ఫీజులు చెల్లించి తమ పిల్లలను అక్కడకే పంపుతారు, కానీ పక్కనే వున్న ప్రభుత్వ పాఠశాలలో డిగ్రీ, పీజీ, టీటీసీ, బి ఎడ్ లు పూర్తి చేసి ఎంతో కాంపిటేషన్ వున్న డి ఎస్ సిలో సెలెక్ట్ అయ్యి విద్య నేర్పే టీచర్ లు వు న్న ఈ ప్రభుత్వ పఠశాలలో మాత్రం విద్యార్థులని పేరెంట్స్ జాయిన్ చేయడములేరు.
కారణాలు అనేకం ఈ విషయంపై కొందరు విద్యార్థుల తల్లి దండ్రులు చెప్పిన మాటలు.
1. తమ పిల్లలని ప్రైవేటు పఠశాలలో చదివిస్తే అక్కడ చదువు బాగా చెబుతారని దింతో తమ పిల్లలు బాగా చదువుతారని నమ్మకం. 2. పక్కవారి పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలో జాయిన్ చేస్తే వీరు కూడా అక్కడ కానీ అంత కన్నా పెద్ద ప్రైవేట్ పాఠశాలలో జాయిన్ చేయడం.3. ఏ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల పిల్లలు కానీ, ప్రభుత్వ అధికారు ల పిల్లలు కానీ, ఏ ప్రజాప్రతినిధి పిల్లలు కానీ ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చదవక పోవడం.
ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు ముందుకొస్తే బాగు
గతంలో కొందరు అధికారులు ముందుకొచ్చి వారికి గాని వారి కుటుంబీకులకు గాని ప్రభుత్వ వైద్య శాలల్లో వైద్యం తీసుకోని ప్రభుత్వ వైద్యశాల మీద నమ్మకం పెంచినట్టు, అధికారులు కానీ ప్రజా ప్రతినిధులుకానీ ముందుకొచ్చి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో జాయిన్ చేసిన రోజు తల్లిదండ్రులు ముందుకొచ్చి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో జాయిన్ చేస్తారని కొందరు మేధావులు అంటున్నారు. ఆ రోజు పిల్లల్ని జాయిన్ చేసేందుకు ఈ ప్రభుత్వ పాఠశాలల ముందు తల్లి దండ్రులు బారులు తిరుతారని, మళ్ళీ పాఠశాలలకి పూర్వ వైభవం వస్తుందని అంటున్నారు.