21 April, 2026 | 5:39 PM

Breaking News

బడుగు బలహీన వర్గాల సమగ్ర ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   అకాల వర్షం ఈదురుగాలతో విద్యుత్ శాఖకు నష్టం   •   బస్సు ఢీకొని వ్యక్తి మృతి   •   గోవులను నదులతో సమానంగా గౌరవించాలి   •   విద్యార్థులు లక్ష్యసాధనకు కృషి చేయాలి - కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   కొడుకుతో కలిసి కట్టుకున్నోడినే కడతేర్చిన భార్య   •   రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది.. కాంగ్రెస్ మళ్లీ గెలవదు!   •   ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •   మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •  

14 రోజుల పసికందును హత్య చేసిన తండ్రి

16-05-2025 12:00 AM
  1. కత్తితో గొంతు కోసిన కర్కోటకుడు 
  2. గోల్కొండకు పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం

కార్వాన్, మే15: దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి కూతురును దారుణంగా హత్య చేశాడు. కత్తి తో గొంతు కోసి పాశవికంగా హతమార్చిన హృదయ విదార ఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుం ది. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకా రం.. నేపాల్ దేశానికి చెందిన జగత్, గౌరీ దంపతులు. కొన్నేళ్ల క్రితం వీరు గోల్కొండ ప్రాంతానికి వలస వచ్చారు.

స్థానికంగా క్రిస్టల్ అపార్ట్మెంట్లో ఉంటూ అక్కడే వాచ్మెన్ గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. దంపతులకు గతంలో ఇద్దరు కుమార్తెలు ఉ న్నారు. మరోమారు 14 రోజుల క్రితం గౌరీ మరో కుమార్తెకు జన్మనిచ్చింది. ఇదిలా ఉం డగా, వారం రోజులుగా జగత్ అన్నం తినడం లేదు. ముభావంగా ఉంటున్నాడని గౌరీ పోలీసులకు తెలిపింది. ఈ క్రమంలో జగత్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నట్లు తెలియజేసింది.

ఈ నేపథ్యంలో జగత్ గురు వారం తెల్లవారుజామున రెండు గంటలకు 14 రోజుల పసికందును బయటకు తీసుకెళ్లి ఇంటి గేటు సమీపంలో కత్తితో గొంతు కోసి చంపేశాడు. ఉదయం నిద్ర లేచిన తర్వాత గౌరీ కూతురు కోసం చూడగా జరిగిన విష యం వెలుగు చూసింది. అనంతరం ఆమె గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మాని ఆసుపత్రికి తరలించారు. 

అలా జరిగింది..

 14 రోజుల పసికందును చంపేసిన జగత్ ను పోలీసులు విచారించారు. ’అలా.. జరిగింది..’ అని అతడు పోలీసులకు చెప్పడం గమనార్హం. ఈ మేరకు కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్  సైదులు తెలిపారు.