16-05-2025 11:58:14 AM
హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ పని చేయడానికి అయినా అప్పటి మంత్రులు పైసలు తీసుకునేవారని నేను అన్నటువంటి వ్యాఖ్యలను కొంతమంది పూర్తిగా వక్రీకరించారని మంత్రి సురేఖ(Minister Konda Surekha) వెల్లడించారు. అవినీతి చేయకుండానే కేటీఆర్, కవితకు ఇన్ని ఆస్తులు వచ్చాయా? అని సురేఖ ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రుల పనితీరును ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పారు.
తన వ్యాఖ్యలు తప్పుగా వక్రీకరించడం సహేతుకం కాదన్న మంత్రి ఈ మొత్తం ఇష్యూ మీద ఈరోజు వీడియో ద్వారా మరిన్ని వివరాలు తెలియజేస్తానని కొండా సురేఖ పేర్కొన్నారు. మంత్రుల దగ్గర ఏ పని జరగాలన్నా.. ఏ ఫైల్ కదలాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. తోటి మంత్రులపై మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.