30-05-2025 12:27:01 AM
టిఎస్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నివాస్
రాజేంద్రనగర్, మే 29 : రంగారెడ్డి జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలో ఫీజుల దోపిడీని అరికట్టాలని, అనుమతి లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని టి ఎస్ ఎస్ ఓ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఆరంఘర్ లోని కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు, బట్టలు, పెన్నులను విద్యా సంవత్సరం ప్రారంభమౌతున్న సమయంలో విచ్చలవిడిగా దందాకు తెరలేపారని ఆరోపించారు.
నిబంధనలు పాటించని బడులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో వెంటనే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ప్రైవేటు పాఠశాలల్లో తనిఖీలు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు పేద, మధ్య తరగతి ప్రజలను మభ్యపెట్టి లక్షల రూపాయలు ఫీజులను దోచుకుంటున్నా అధికారులు నిర్లక్ష్యపు మత్తులో జోగుతున్నారని ధ్వజమెత్తారు.
ప్రైవేట్ పాఠశాలలను గుర్తించి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట కో ఆర్డినేటర్ కర్రే సుదర్శన్, టీఎస్ఎస్ఓ రాష్ట సోషల్ మీడియా ఇంచార్జి మీసాల వర్షిత్, టీఎస్ఎస్ఓ రాష్ట నాయకులు.సుధాకర్ సంపత్, గడ్డం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.