17 April, 2026 | 2:51 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

30-05-2025 12:28 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి 

అమనగల్లు, మే 29: అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే కసిరెడ్డి  నారాయణరెడ్డి పేర్కొన్నారు. గురువారం అమనగల్లు మండలంలోని రాము నుంతల అంబేద్కర్  పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే భూమిక పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు స్థానిక నేతలతో కలిసి మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుందన్నారు. లబ్ధిదారులంతా సకాలంలో ఇల్లు నిర్మించుకోవాలని నిర్మాణ దశలను బట్టి వారికి బిల్లులు మంజూరు అవుతాయని ఆయన హామీనిచ్చారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదల పక్షపాతి అని ఆయన గుర్తు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసి తీరుతామని...

ప్రతిపక్ష పార్టీలకు తమ అభివృద్ధితోనే సమాధానం చెబుతామన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గీత, వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి,ఏవో శ్రీనివాస్ గౌడ్, సింగిల్ విండో మాజీ చైర్మన్  శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్వేతా ఆనంద్, యాట నరసింహ, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు జగన్ తదితరులు పాల్గొన్నారు.