17 July, 2026 | 1:52 PM

Breaking News

పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •   దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు   •   ఈనెల 20న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా   •   హత్య కేసులో నిందితురాలి అరెస్ట్.. ఆస్తి కోసం అత్తను చంపిన కోడలు   •  

మార్లవాయిలో గొండ్వాన పంచాయతీ రాయి సెంటర్ నూతన సభ్యుల సన్మానం

18-05-2026 03:15 PM

జై నూర్,మే18 (విజయ క్రాంతి) : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నూతనంగా నియమితులైన గొండ్వాన పంచాయతీ రాయి సెంటర్ సభ్యులను సోమవారం ఘనంగా సన్మానించారు. సన్మానితులైన వారిలో సార్ మేడి గేడం గణపత్ రావు, గీతాదర్ ఆత్రం భగవంత్ రావు, రాయి సెంటర్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఆడ సోనేరావు ఉన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కనక ప్రతిభ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధితో పాటు గొండ్వాన పంచాయతీ రాయి సెంటర్ వ్యవస్థ పటిష్టతకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ సమాజం విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ముందుకు సాగేందుకు రాయి సెంటర్ కీలక పాత్ర పోషించాలని ఆమె ఆకాంక్షించారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఆత్రం రాజేశ్వర్, పాలకవర్గ సభ్యులు కనక భరత్, తుంరం సీత, కొడప పుల్లబాయి, తొడసం సర్జబాయి, జూగ్నక ధైర్యవంతి, గ్రామపంచాయతీ కార్యదర్శి మనోజ్, పీసా మొబైల్ కనక యాదవ్, అంగన్వాడీ టీచర్ కొడప నెత్తుబాయి, ఆశా వర్కర్ ఆడ చంద్రకళ, ఆత్రం దేవషావ్ పటేల్, సిబ్బంది సోనే రావు, జ్యోతి రామ్ లచ్చు తదితరులు పాల్గొన్నారు.