18 May, 2026 | 4:33 PM

Breaking News

కైలాస్ టేకిడి ఆలయం వద్ద బిల్వ మొక్కలను నాటిన మాజీ ఎంపీపీ   •   నవ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   సింగిల్ విండో లో ఎలాంటి అక్రమాలు జరగలేదు   •   కేబీఆర్‌ పార్క్‌ పరిసరాల్లో చెట్లు నరికివేతపై సుప్రీంకోర్టు స్టే   •   కేబీఆర్‌ పార్క్‌ పరిసరాల్లో చెట్లు నరికివేతపై సుప్రీంకోర్టు స్టే   •   బండి సంజయ్ తప్పు చేయలేదు: రామచందర్‌రావు   •   బస్తర్‌లో ఘోర బస్సు ప్రమాదం — ఒకరు మృతి, 20 మందికి గాయాలు   •   ప్రైవేట్‌కు అమ్మొద్దు.. మార్కెట్ ఫెడ్ కేంద్రానికే జొన్నలు తీసుకురండి: చైర్మన్ విశ్వనాథ్ రావు   •   మార్లవాయిలో గొండ్వాన పంచాయతీ రాయి సెంటర్ నూతన సభ్యుల సన్మానం   •   కరెంటు అడ్డుకుంటున్న అటవీ శాఖ అధికారులపై చర్య తీసుకోండి   •  

మార్లవాయిలో గొండ్వాన పంచాయతీ రాయి సెంటర్ నూతన సభ్యుల సన్మానం

18-05-2026 03:15 PM

జై నూర్,మే18 (విజయ క్రాంతి) : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నూతనంగా నియమితులైన గొండ్వాన పంచాయతీ రాయి సెంటర్ సభ్యులను సోమవారం ఘనంగా సన్మానించారు. సన్మానితులైన వారిలో సార్ మేడి గేడం గణపత్ రావు, గీతాదర్ ఆత్రం భగవంత్ రావు, రాయి సెంటర్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఆడ సోనేరావు ఉన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కనక ప్రతిభ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధితో పాటు గొండ్వాన పంచాయతీ రాయి సెంటర్ వ్యవస్థ పటిష్టతకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ సమాజం విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ముందుకు సాగేందుకు రాయి సెంటర్ కీలక పాత్ర పోషించాలని ఆమె ఆకాంక్షించారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఆత్రం రాజేశ్వర్, పాలకవర్గ సభ్యులు కనక భరత్, తుంరం సీత, కొడప పుల్లబాయి, తొడసం సర్జబాయి, జూగ్నక ధైర్యవంతి, గ్రామపంచాయతీ కార్యదర్శి మనోజ్, పీసా మొబైల్ కనక యాదవ్, అంగన్వాడీ టీచర్ కొడప నెత్తుబాయి, ఆశా వర్కర్ ఆడ చంద్రకళ, ఆత్రం దేవషావ్ పటేల్, సిబ్బంది సోనే రావు, జ్యోతి రామ్ లచ్చు తదితరులు పాల్గొన్నారు.