6 June, 2026 | 9:27 PM

Breaking News

బదిలీపై వెళ్తున్న డీవైపీఎం సన్మానం

06-06-2026 08:32 PM

నస్పూర్,(విజయక్రాంతి): సింగరేణి సంస్థలో ఇటీవల జరిగిన బదిలీల్లో శ్రీరాంపూర్ ఏరియా పర్సనల్ విభాగంలో డీవైపీఎం(డిప్యూటీ పర్సనల్ మేనేజర్ ) గా విధులు నిర్వహిస్తున్న  M. రాజేష్ కార్పోరేట్ కు బదిలీ అయ్యారు. శనివారం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం నుంచి రిలీవ్ అవుతున్న సందర్భంగా డీజీఎం(పర్సనల్) ఎస్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పర్సనల్ విభాగం అధికారులు, ఉద్యోగులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీజీఎం(పర్సనల్) ఎస్ . అనిల్ కుమార్, గుర్తింపు సంఘం జీఎం చర్చల ప్రతినిధి బద్రి బుచ్చయ్య, డీవైపీఎం కిరణ్ కుమార్, సీనియర్ పీఓలు ప్రశాంత్, సురేందర్, సంక్షేమ అధికారి రమేష్ నాయక్, పర్సనల్ విభాగం క్లరికల్ స్టాఫ్, గుర్తింపు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.