calender_icon.png 21 December, 2025 | 2:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సకాలంలో రైతులకు ఎరువులు

19-12-2025 12:00:00 AM

ఎరువుల బుకింగ్ మొబైల్ యాప్ ను రైతులు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ దివాకర టి.ఎస్

ములుగు,డిసెంబర్18(విజయక్రాంతి):రైతులకు సకాలంలో ఎరువులు అందుటకు ఎరువుల బుకింగ్ మొబైల్ యాప్ ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎరువుల బుకింగ్ యాప్ రైతులకు అందుబాటులోకి రావడం జరిగిందని ఈ యాప్ ద్వారా పట్టా, ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టా ఉన్న రైతులు, కౌలు రైతులు, పట్టా లేని రైతులు కూడా ఈ అప్లికేషన్ ద్వారా ఎరువులను బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు.

బుకింగ్ చేసుకునే సమయంలో రైతులు తమ పట్టా పాస్ బుక్ నెంబర్, ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా నెంబర్, పట్టా లేని రైతులు సాగు చేస్తున్న భూమి వివరాలు వారి ఆధార్ కార్డు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అన్నారు.యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్న రైతులు ఆర్డర్ కన్ఫర్మేషన్ అవ్వగానే సమీప ఫెర్టిలైజర్ దుకాణం అలోకేషన్ అవుతుందని రైతులు వెంటనే మరుసటి రోజు సంబంధిత ఫర్టిలైజర్ దుకాణంలో యూరియా ఎరువులు తీసుకోవచ్చని తెలిపారు.

సాగు చేసే ఎకరాల ఆధారంగా పలు విడుదలలో యూరియా బస్తాలను రైతులు తీసుకోవాలని ,ఎకరం విస్తీర్ణం సాగు చేసే రైతు ఒకే వాయిదాలో, ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాల విస్తీర్ణం సాగు చేసే రైతులు రెండు వాయిదాలలో, ఐదు నుంచి 20 ఎకరాల విస్తీర్ణం సాగు చేసే రైతులు నాలుగు వాయిదాలలో ఎరువు బస్తాలను తీసుకోవచ్చని, ఒక విడత ఎరువులు తీసుకున్న తర్వాత, తదుపరి స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి ఖచ్చితంగా 15 రోజుల వ్యవధి ఉండాలన్నారు.

ఈ మొబైల్ అప్లికేషన్ పై స్థానికంగా ఉండే మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏఈఓలకు అందరికీ శిక్షణ ఇవ్వడం జరిగిందని సహకార సంఘాలకు, డీఎస్డిఎస్ సభ్యులు అండ్ ఆల్ ఫెర్టిలైజర్ షాప్ కీపర్స్ కి కూడా అవగాహన కల్పించడం జరిగింది ఆయన పేర్కొన్నారు.ఇతర సమాచారం కోసం రైతులు సమీప మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ కార్యాలయాల్లో సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు.