19-12-2025 12:00:00 AM
చేగుంట, డిసెంబర్ 18 : చేగుంట మండలం కరీంనగర్ గ్రామానికి చెందిన మొహమ్మద్ అక్బర్( 20) గత నెల 29న తన వ్యవసాయ పొలములో ట్రాక్టర్ తో దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిం ద పడగా తలకు బలమైన గాయాలయ్యా యి. దీంతో కుటుంబీకులు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు తెలిపారు. మృతుని చిన్నాన్న మహమ్మద్ తయ్యర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చేగుంట ఎస్త్స్ర చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు.