calender_icon.png 16 May, 2025 | 6:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలి..

15-05-2025 11:16:41 PM

పీస్ కమిటీ మీటింగ్ లో పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): శాంతియుత వాతావరణంలో మతపరమైన పండుగలను ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్(DSP Satish Kumar) అన్నారు.  జూన్ 7వ తేదీన జరగబోయే బక్రీద్ పండుగ సందర్భంగా డీఎస్పీ సతీష్ కుమార్ పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్ లో గురువారం మత పెద్దలతో పీస్ కమిటీ మీటింగ్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా పండగలను ప్రతి ఒక్కరు జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

ప్రజలంతా పండుగలను మతసామరస్యంతో జరుపుకునే విధంగా ఆయా మతాల పెద్దలు ప్రజల్లో సమన్వయం ఏర్పడేలా చేయాలన్నారు. పండుగ ఏ మతానిది అయిన సామరస్యత చాలా మంచి సంబంధాలను పెంపొందిస్తుందన్నారు. వచ్చేనెల జరగబోయే బక్రీద్ పండుగ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా శాంతియుత వాతావరణంలో జరిగేలా మత పెద్దలు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే అసాంఘిక శక్తులపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఎవరైనా గొడవలు సృష్టించేలా వ్యవహరిస్తే వెంటనే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను డీఎస్పీ సతీష్ కుమార్ ఆదేశించారు. ఈ పీస్ కమిటీ సమావేశంలో పాల్వంచ ఇన్స్పెక్టర్ కే సతీష్, పాల్వంచ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ K. సుమన్, మత పెద్దలు పాల్గొన్నారు.