10 April, 2026 | 3:34 PM

Breaking News

అన్నా.. నన్ను దేవుడే పంపిండు— కేసీఆర్‌ను కలిసి జీవన్ రెడ్డి భావోద్వేగం   •   ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •  

ఫిల్మ్ క్రిటిక్స్ నూతన కార్యవర్గం ఎన్నిక

24-02-2026 12:15 AM

తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం సోమవారం ఎన్నికైంది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు, అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్, ఉపాధ్యక్షులుగా సీనియర్ ఫోటోగ్రాఫర్ ఈ జనార్దన్‌రెడ్డి, ఎండీ అబ్దుల్, ప్రధాన కార్యదర్శిగా సురేశ్ కొం డేటి, సంయుక్త కార్యదర్శులుగా పర్వీన్, భాగవతుల మురళి, కోశాధికారిగా చదలవాడ భరద్వాజ ఏకగ్రీవంగా ఎన్నుకయ్యారు.

ఈసీ మెంబర్లుగా గిరిధర్, నరసింహ, సాయిరమేశ్, ప్రకాశ్, అప్పాజీ, నవీన్, గోరంట్ల రవి, కుమార్, జీ సురేశ్, శ్యామ్, చందు రమేశ్, టీ కేశవాచారి తదితరులను ఎన్నుకున్నారు. సీనియర్ సభ్యులు బాలిరెడ్డి, లక్ష్మణ్‌రావు, గొటేటి మోహన్ తదితరుల నేతృత్వంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ సమావేశంలో మాజీ కార్యదర్శి లక్ష్మీనారాయణ, సీనియర్ సభ్యుడు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.