07-06-2025 10:11:39 PM
పడమటి అనంత్ రెడ్డి..
కొండాపూర్: మండల పరిధిలోని గిర్మాపూర్ గ్రామంలో ఈనెల 8న బీరప్ప జాతర నిర్వహిస్తున్నారు. జాతర నిర్వహణ కోసం అన్నదాన కార్యక్రమానికి బిఆర్ఎస్ యువ నాయకులు పడమటి అనంత్ రెడ్డి(BRS youth leaders Padamati Ananth Reddy) 25 వేల రూపాయల నగదును యాదవ సంఘానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జాతర నిర్వాణ కోసం తన వంతు సహాయం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
యాదవ సంఘం తరఫున జాతర నిర్వహణకు సహాయం చేసిన అనంత్ రెడ్డికి సంఘం తరఫున గ్రామం తరపున కృతజ్ఞతలు తెలిపారు. మల్లన్న స్వామి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు అనంత్ రెడ్డికి దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకున్నరు. యాదవ సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతర నిర్వాహకులు యాదవ సంఘం నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.