30-07-2025 07:47:53 PM
సంస్థాన్ నారాయణపూర్ (విజయక్రాంతి): సంస్థాన్ నారాయణపూర్ మండలం పుట్టపాక గ్రామానికి చెందిన సుక్క జలంధర్ అనారోగ్యం కారణంగా ఇటీవల మరణించారు. నారాయణపురం మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి బండమీది కిరణ్ కుమార్ బుధవారం జలంధర్ కుటుంబ సభ్యులను పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. అధైర్యపడొద్దని తాను అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బండమీది రాజు, కొలను నరేష్, మేకల గణేష్, ఏర్పల మహేష్, నర్సింహా, సుందరయ్య, తదితరులు పాల్గొన్నారు.