మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
06-03-2026 01:47 AM
రామాయంపేట, మార్చి 5 : రామాయంపేట మండల పరిధిలోని వెంకటాపూర్ (ఆర్) గ్రామానికి చెందిన నడిపోళ్ల రేఖయ్య ఇటీవల ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఈ విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన ప్రముఖ సంఘ సేవకుడు వెంకుగారి రాజిరెడ్డి మృతుని కు టుంబానికి తన వంతు సహాయంగా ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా కు టుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లేశం, నరేష్, ఎల్లయ్య, యాదయ్య, నాగమల్లయ్య, రాము లు, సునీల్ తదితరులు పాల్గొన్నారు.




