05-08-2025 01:37:53 AM
హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసిన తర్వాత అప్పులపై వడ్డీని తగ్గించే అంశాన్ని పరిశీలిస్తామని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. రుణాల చెల్లింపు, రీషెడ్యూల్ మార్పులు చేస్తే ఆర్బీఐ నిబంధనల మేరకు కాళేశ్వరం ప్రాజె క్టు ఖాతా స్టాండర్డ్ నుంచి సబ్ స్టాండర్డ్కు డౌన్గ్రేడ్ అవుతుందని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు లోక్సభలో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల పునర్వ్యవస్థీకరణ చేయా లని తెలంగాణ ప్రభు త్వం నుంచి వినతులు వచ్చాయని ఆయన తెలిపారు. ప్రాజెక్టు స్పెషల్ పర్పస్ వెహికిల్కు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ రుణాలు ఇచ్చాయని వెల్లడించారు.
పీఎఫ్సీ, ఆర్ఈసీ లాంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు వివిధ మార్గా ల్లో నిధులు సేకరిస్తాయని, వాటికయ్యే ఖర్చుల ఆధారంగా వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయని పేర్కొ న్నారు. ప్రాజెక్టు పూర్తయ్యే సమయాన్ని ఇప్పటికే 2024, డిసెంబర్కు ఆర్ఈసీ పొడిగించినట్టు ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాకే రుణాలపై వడ్డీరేట్లను నిర్ణయిస్తామని ఆయన స్పష్టం చేశారు.