13-04-2025 10:19:08 PM
అశ్వారావుపేట,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం దురదపాడు పంచాయతీలోని శివారు గ్రామమైన పాలగుంపులో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మూడు ఇళ్ళు పూర్తిగా దగ్దం అయ్యాయి. మడకం రాజు,నల్లబెల్లి స్వప్న, కోర్సా భద్రం లకు చెందిన ఇండ్లు అగ్నికిహావుతి అయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం రావాల్సి ఉంది