13-04-2025 10:16:28 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ ఎదుట ఆదివారం దేశీదారు కలిగి ఉన్న కోట సారమ్మ (55) అనే మహిళను పట్టుకొని తొమ్మిది లీటర్ల అక్రమ దేశీదారు మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు బెల్లంపల్లి టూ టౌన్ ఎస్ఐ కె. మహేందర్ తెలిపారు. హనుమాన్ బస్తీకి చెందిన కోట సారమ్మపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.