15 June, 2026 | 2:59 PM

Breaking News

తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •  

పటాకుల గోదాంలో అగ్నిప్రమాదం

19-10-2025 12:36 AM
  1. భారీగా ఎగిసిపడిన మంటలు 
  2. భయంతో పరుగులు తీసిన కార్మికులు, జనం
  3. సంగారెడ్డి జిల్లా అందోల్‌లో ఘటన

సంగారెడ్డి, అక్టోబర్ 18 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా ఆందోల్ శివారులో కటకం వేణుగోపాల్ అనే వ్యక్తికి చెందిన పటాకుల హోల్‌సేల్ గోదాం వద్ద శనివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద పెద్ద శబ్దాలతో టపాసులు పేలిపోయి మంటలు చెలరేగాయి. భారీగా ఎగిసిపడిన మంటలతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు, స్థానికులు భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకొన్న జోగిపేట ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పి వేశారు.

గోదాం లో తగిన జాగ్రత్తలు లేనందున ఈ అగ్నిప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో తెలుసు కోవడానికి పోలీసు బృందం దర్యాప్తు చేస్తుందని, సంగారెడ్డి జిల్లాలో పటాకుల దుకాణంలో పలు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఇదివరకే జిల్లా ఎస్పీ హెచ్చరించిన విషయం తెలిసిం దే. ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని త్వరలోనే తేలుస్తామని జోగిపేట ఎస్‌ఐ పాండు తెలిపారు.