calender_icon.png 24 June, 2025 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హన్మాజీపేటలో అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఇల్లు

24-06-2025 01:26:10 AM

రాజన్న సిరిసిల్ల జూన్ 23 (విజయక్రాంతి) వేములవాడ రూరల్ మండలం హ న్మాజీపేట గ్రామంలో సోమవారం ఉద యం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రా మానికి చెందిన మాజీ సర్పంచ్ గొర్రె రాజ వ్వ మైసయ్య ఇల్లు పూర్తిగా దగ్ధం కావడంతో ఒక్కసారిగా స్థానికులు భయందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో అగ్ని ప్ర మాద విషయం గ్రామస్తులు ఫైర్ స్టేషన్ స మాచారం అందించారు.

ఫైర్ ఇంజన్ ఘట న స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్ర యత్నం చేస్తున్నారు. అయితే ఘటనలో ఏ లాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో కు టుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు ఊపి రి పీల్చుకున్నారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సిఉంది..

అధైర్య పడవద్దు అండగా ఉంటా:ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జూన్ 23 (విజయక్రాంతి )వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగి మాజీ సర్పంచ్ గొర్రె రాజవ్వ మైసయ్య ఇల్లు దగ్ధం కాగ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దగ్ధం అయిన ఇల్లును పరిశీలించారు.ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు..

సెస్ అధికారు లతో, జిల్లా కలెక్టర్ తో మాట్లాడి తక్షణ సహాయం కింద పరిహారం అందజేయాల్సిందిగా సూచించారు..నిత్యావసర వస్తువులు బాధిత కుటుంబానికి అందజేశారు.. వెంటనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు.. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని ప్రభుత్వం తరపున అండగా ఉంటా మనిహామీఇచ్చారు.