24-06-2025 01:24:31 AM
-ఐ.ఎన్.టి.యు.సి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి విజ్ఞప్తి
ముషీరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రో వాటర్ వరక్స్ అండ్ సేవరజ్ బోర్డులో చట్టం ప్రకారం ఉ ద్యోగ సంఘాల గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని ఐ.ఎన్.టి.యు.సి రాష్ట్ర ఉపాధ్యక్షులు, హెచ్ఏండబ్ల్యూడబ్ల్యూ అండ్ ఎస్.బి కాంగా రు యూనియన్ అధ్యక్షులు మొగుళ్ళ రాజి రెడ్డి జలమండలి ఎండి అశోక్ రెడ్డికి విజ్ఞప్తి చేసారు. హైదరాబాద్ ఖైరతాబాద్ లోని జలమండలి కార్యాలయంలో సోమవారం జలమండలి ఎండి అశోక్రెడ్డిని కలిసి జలమండలి ఉద్యోగ సంఘాల ఎన్నికల నిర్వహ ణకు సంబంధించి పలు డిమాండ్లపై మొగు ళ్ళ రాజిరెడ్డితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కె. రామరాజు, అసోసియేట్ ప్రెసిడెంట్ బి. భూమయ్య, కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ వినతి పత్రం అందజేశారు.
చట్ట ప్రకారం అర్హులైన యూనియన్లతో చేర్చలు జరపాలన్నా రు. ప్రతి ఉద్యోగికి కొత్త గుర్తింపు కార్డులు జా రీ చేయడంతోపాటు, ఓటర్ లిస్టులను సవరించాలని, వాటర్ వరక్స్ ఎంప్లాయిస్ యూ నియన్ నం. 2873 ( రెండు గ్రూపుల వివాదంతో) కోర్టులో ఉన్నందున, 2873 యూని యన్ను ఎలక్షన్ / బోర్డు లో పరిగణలోకి తీసుకొనకూడదని అన్నారు. జలమండలిలో క్రింది స్తాయి ఉద్యోగుల ప్రమోషన్లు, సర్కిల్ -1, బోర్డు లెవెల్లో ఆర్డర్స్ ఇచ్చే ప్రక్రియలో ఉన్నందున, ప్రమోషన్ల ప్రక్రియ ముగిసిన తరువాత ఎన్నికలు నిర్వహించాలని జాయింట్ కమీషనర్ అఫ్ లేబర్, రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చినటువంటి ఎలక్షన్ నోటీసులో డేట్ అఫ్ రెకొనింగ్ 01-10-2024 అని పేర్కొని దాదాపు 8 నెలలు అయిందన్నారు. ఈ 8 నెలల్లో దాదాపు 500 మంది ఉద్యోగులు రిటైర్మెంట్ కాగా చాలా మంది ఉద్యోగులు చనిపోయినారని తెలిపారు.