17 April, 2026 | 10:27 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఏకశిలానగర్‌లో హైడ్రా కూల్చివేతలు

24-06-2025 01:26 AM
  1. వెంచర్‌లో నిబంధనలకు విరుద్ధంగా ప్రహరీ నిర్మాణం
  2. స్థానికుల ఫిర్యాదులతో రంగంలోకి అధికారులు

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 23 (విజయక్రాంతి)/ఘట్‌కేసర్: మేడ్చల్ గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని కొర్రెముల రెవెన్యూ పరిధిలోని ఏకశి లానగర్‌లో హైడ్రా అధికారులు సోమవా రం కూల్చివేతలు చేపట్టారు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తన వెంచర్‌లోని ప్లాట్లకు అడ్డుగా, నిబంధనలకు విరుద్ధంగా ప్రహరీ నిర్మించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నిర్మాణంపై స్థానికుల నుంచి హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు చేపట్టగా..  ప్రహరీ నిర్మాణం అక్రమంగా జరిగినట్లు నిర్ధారణ అయింది. దీంతో సోమవారం ఉదయం నుంచే భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రహరీని కూల్చివేశారు.