16 April, 2026 | 2:00 AM

అగ్నిమాపక వారోత్సవాల గోడపత్రికను ఆవిష్కరిన

16-04-2026 12:25 AM

కూసుమంచి, ఏప్రిల్ 15 (విజయ క్రాంతి): కూసుమంచి అగ్నిమాపక అధికారులు వేసవికాలంలో ప్రజలకు ప్రమాదాల నివారణ పై ఈనెల 14 వ తారీకు నుండి 20వ తారీకు వరకు అగ్నిమాపక  వారోత్సవాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం వారు రూపొందించిన గోడపత్రికను తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఇంచార్జ్  భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారులు, కూసుమంచి మండల మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు, కాంగ్రెస్ పార్టీ పాలేరు నియోజకవర్గ నాయకులు బజ్జూరి వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ చాట్ల పరుశురాం తదితరులు పాల్గొన్నారు.