calender_icon.png 11 December, 2025 | 2:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంత వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు

11-12-2025 12:12:54 PM

జిల్లా ఎస్పీ మహేష్ దిగితే.

రాజన్నసిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు(First phase of Gram Panchayat elections) ప్రశాంతంగా జరుగుతున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులకు, సిబ్బందికి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేల భద్రత పరమైన పలు సూచనలు చేశారు. మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.పెట్రోలింగ్ వాహనాలు,ప్రత్యేక పోలీసు బృందాలు నిరంతరం పర్యటిస్తూ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.