22 June, 2026 | 8:06 PM

Breaking News

బెల్లంపల్లి ఆసుపత్రి ఎదుట..   •   ప్రభుత్వ విప్ విజయరమణ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్, బీజేపీ నాయకులు..   •   పెన్షనర్ ల సమస్యను పరిష్కరించండి   •   పెంచిన ఎరువులు, డీజిల్, పెట్రోల్ ధరలు తక్షణమే తగ్గించాలి   •   ప్రైమరీ టీచర్ల భర్తీలలో జిల్లా వ్యాప్తంగా ఒకే విధానం కొనసాగాలి   •   కోయగూడెం ఓసీపీలో సింగరేణి డైరెక్టర్ (ఈ&ఎం) తిరుమల రావు పర్యటన   •   అమెరికాలో గంగారం యువకుడు మృతి   •   విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్   •   భూముల సర్వేను పక్క చేయాలి   •   ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి   •  

పంచాయతీ ఎన్నికలు.. 11 గంటల వరకు 52 శాతం పోలింగ్

11-12-2025 11:59 AM

హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి దశలో తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్(Telangana Gram Panchayat Elections) కొనసాగుతోంది. తొలి విడతలో మొత్తం 189 మండలాల్లోని 3,834 గ్రామ పంచాయతీలలో సర్పంచ్ స్థానాలకు, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు గురువారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి తెల్లవారుజాము నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఉదయం 11 గంటల వరకు 52.00 శాతం పోలింగ్(polling percentage) నమోదు అయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం(State Election Commission) ప్రకటించింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగుతోంది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కిస్తారు.