calender_icon.png 1 June, 2025 | 11:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

8న ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీ

29-05-2025 12:18:30 AM

ముషీరాబాద్, మే 28 (విజయక్రాంతి) : జూన్ 8 న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉదయం చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిని గౌడ్స్ కుటుంబ సభ్యులు వెల్లడించారు.

బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దివంగత బత్తిని హరినాథ్ గౌడ్ తనయుడు బత్తిని అమర్ నాథ్ గౌడ్ మాట్లాడుతూ మృగశిర కార్తీ జూన్ 8 ఆదివారం ఉదయం 10 గం.లకు ప్రవేశిస్తుందని, ఆ రోజునే చేప ప్రసాదం పంపిణీ చేస్తామని తెలిపారు.

దేశ, విదేశాల నుండి లక్షలాది మంది వస్తుం టారని, అందుకోసం ఎవ్వరికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా పంపి ణీ సజావుగా సాగడానికి ఈ సంవత్సరం ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుందని వివరించారు. జీహెచ్‌ఎంసీ, వాటర్ వరక్స్, ఆర్టీసీ, మున్సిపాలిటీ, పోలీస్, విద్యు త్తు శాఖతో పాటు మత్య్సశాఖలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉన్నామన్నారు.

దాదాపు రెండు శతాబ్దాలుగా తమ కుటుంబం ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధు ల నివారణకు మృగశిర కార్తీ ప్రవేశించిన ఘడియల్లో ఓ పదార్ధాన్ని చేప ద్వారా రోగి నోట్లో వేస్తామని, అది వ్యాధి తీవ్రతను బట్టి రోగి నాల్గు నుండి ఐదు సంవత్సరాలు తీసుకుంటే పూర్తిగా నయం అవుతోందని పేర్కొ న్నారు.

నిస్వార్థంగా ఉచితంగా లక్షలాది మంది శ్వాస సంబంధిత రోగులకు చాప మందు ఇస్తున్నామన్నారు. అత్యవసర వైద్య సదుపాయంతో పాటు క్యూ లైన్‌లో రోగులు ఇబ్బందులు పడకుండా ౨౦౦ మంది వలంటీర్లు సేవ లందిస్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు శివ శంకర్ గౌడ్, గౌరీ శంకర గౌడ్, చంద్ర శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.