09-08-2024 12:05:00 AM
పలువురి అరెస్టు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 8 (విజయక్రాంతి): మల్కాజిగిరి, మేడ్చల్, నాంపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం దాడులు నిర్వహించి 5.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్రెడ్డి తెలిపారు. మల్కాజిగిరి పరిధిలోని మచ్చాబల్లారంలో సీఐ సుభాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో 2.22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, హేమంత్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు కమలాసన్రెడ్డి వెల్లడించారు.
అదేవిధంగా మేడ్చల్ పరిధిలోని దం తాలపల్లిలో సాత్విక్ స్టీల్ ఉద్యోగ్ స్థలంలో వాచ్మెన్గా పనిచేస్తున్న బీహార్కు చెందిన వికాస్ అనే వ్యక్తి గంజాయి మొక్కలు పెంచుతున్నాడని గుర్తించిన డీటీఎఫ్ పోలీసులు.. ఆ మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఫయా జోద్దీన్ తెలిపారు. నాంపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ అనిల్కుమార్రెడ్డి తెలిపారు. మల్కాజిగిరి రైల్వే స్టేషన్ వద్ద 1.8 కిలోల గంజాయిని పట్టుకొని గ్రిల్ జోసెఫ్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్కుమార్ తెలిపారు.
ధూల్పేట్లో 1.20 కిలోలు..
ధూల్పేట్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్లు ఖురేషి, శాస్త్రి, అసిస్టెంట్ కమిషనర్ అనిల్కుమార్ రెడ్డి పర్యవేక్షణలో గురువారం రాత్రి తనిఖీలు నిర్వహించినట్లు సూపరింటెండెంట్ అంజి రెడ్డి తెలిపారు. ఈ తనిఖీల్లో దిలావర్గం వద్ద గంజాయి అమ్ముతున్న నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి 1.20 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.