09-08-2024 12:05:00 AM
విద్యార్థుల ఆందోళన
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 8 (విజయక్రాంతి): మల్లారెడ్డి కాలేజీలో ఓ విద్యార్థి మృతిచెందాడు. పేట్బషీర్బాగ్ పోలీసుల కథనం ప్రకారం.. మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ మొదటి సంవత్సరం చదువుతున్న అరుణ్ కుమార్(19) అనే విద్యార్థి గురువారం క్లాస్ రూమ్లో స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో అతనిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే చనిపోయినట్లుగా గుర్తించారు.
కాగా, యాజమాన్యం నిర్లక్ష్యం, కాలేజీకి అంబులెన్స్ ఆలస్యంగా రావడం వలనే అరుణ్ కుమార్ మృతిచెందాడని తోటి విద్యార్థులు కాలేజీ ఎదుట బైఠాయించి మల్లారెడ్డికి, యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతికి గల కారణాలపై విచారణ చేపట్టారు.