20-07-2025 03:59:35 PM
అహ్మదాబాద్: అహ్మదాబాద్ జిల్లాలోని బావ్లా తాలూకాలోని బగోదర గ్రామంలో హృదయ విదారక సంఘటన జరిగింది. బగోదర బస్ స్టేషన్ సమీపంలోని ఒక అద్దె ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న బగోదర పోలీసులు 108 అంబులెన్స్ బృందంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అదనంగా, అహ్మదాబాద్ రూరల్ ఎస్పీ, ధంధుకా డివిజన్ ఎఎస్పీ, ఎల్సీబీ పీఐ, ఎస్ఓజీ పీఐ, ఎఫ్ఎస్ఎల్ అధికారులతో సహా సీనియర్ పోలీసు అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతులందరు ఒకే కుటుంబానికి చెందిన వారిని, వారు విషం తాగి సామూహిక ఆత్మహత్య చేసుకున్నారు. భార్యాభర్తలు, వారి ముగ్గురు అమాయక పిల్లలు విషాదకరంగా మరణించారు. మృతులను విపుల్ కాంజీ వాఘేలా (34), అతని భార్య సోనాల్ (26) మరియు వారి ఇద్దరు కుమార్తెలు (11 మరియు 05) మరియు ఒక కుమారుడు (08)గా పోలీసులు గుర్తించారు. ఈ కుటుంబం దేవిపూజక్ వాస్లోని ధోల్కాలోని బార్కోటా ప్రాంతానికి చెందినవారని, ప్రస్తుతం బగోదర బస్ స్టేషన్ సమీపంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మృతుడు విపుల్భాయ్ ఆటో రిక్షా నడుపుతూ తన కుటుంబానికి జీవనోపాధి పొందుతున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలింది. ఐదు మృతదేహాలను పోస్ట్మార్టం కోసం బగోదర కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. అయితే, ఈ కుటుంబం ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందనే దానిపై ఇంకా స్పష్టమైన కారణం బయటపడలేదు.ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు వెల్లడించారు.