15-06-2025 02:11:19 PM
బైంసా,(విజయక్రాంతి): బాసరలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆదివారం అక్కడికి పర్యటనకు వచ్చిన ఐదుగురు యువకులు ప్రమాదవశాత్తు దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ కు చెందిన స్నేహితులు రాకేష్, వినోద్, మదన్, రితీష్, భరత్ స్నేహితులు బాసర పుణ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు వచ్చారు. ఈ క్రమంలో వారు గోదావరి నదిలో ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం బైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా ఓకే కుటుంబానికి చెందిన వారన్ని, హైదరాబాద్ లోని చింతల్ కు చెందిన 18 మంది కుటుంబసభ్యులు బాసర పుణ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు వెళ్లారు.