15-06-2025 02:00:01 PM
హైదరాబాద్: స్థానిక ఎన్నికలు రాబోతున్నాయని ప్రకటించడం బీసీలకు చేస్తున్న అన్యాయమని బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఎందుకు మాట్లాడలేదు..? అని ప్రశ్నించారు. రిజర్వేషన్లపై బీసీలను తెలంగాణ ప్రభుత్వం దగా చేస్తోందని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. బీసీ బిల్లు కేంద్ర ప్రభుత్వానికి పంపి చేతులు దులుపుకోవడం సరికాదని, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు..? అని అడిగారు. ఈ రేవంత్ సర్కార్ ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలతో రాష్ట్ర ప్రజలను మోసం, ఇప్పులు మళ్లీ అదే రితిలో బీసీలకు రిజర్వేషన్ పేరుతో మోసం చేసే ప్రయత్నం చేస్తోందని ఆయన విరుచుకుపడ్డారు. అక్కరకు రాని పదవులే బీసీలకు ఇస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.