యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఓటును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కలెక్టర్ హనుమంతు కె జండగె కోరారు. గురువారం మండలంలోని రాయగిరిలో రాచకొండ కమిషనరేట్ డీసీపీ రాజేశ్ చం ద్ర ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఓటర్లకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఎన్నికల్లో ఎవరైనా ఎన్నికల నియమ, నిబంధనలు ఉల్లంఘిస్తే ‘సీ విజి ల్’ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నా రు. కార్యక్రమంలో ఆర్డీవో అమరేందర్, తహసీల్దార్ అంజిరెడ్డి, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, భువనగిరి ఏసీపీ రవికిరణ్రెడ్డి, పట్టణ సీఐ సురేశ్కుమార్, రూరల్ సీఐ ప్రభాకర్రెడ్డి, ఎస్ఐ సంతోశ్కుమార్, కేంద్ర బలగాల పోలీసులు పాల్గొన్నారు.