03-12-2025 12:00:00 AM
-నిర్దేశిత సమయంలో పనులు పూర్తికావాలి
-ఆచార సంప్రదాయాలను పాటించాలి
-మేడారం అభివృద్ధి పనులపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి):మేడారం అభివృద్ధి పనుల్లో నాణ్య తాప్రమాణాలు పాటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారులు, ఇంజినీర్లు క్షేత్ర స్థాయిలో ఉండి పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని.. ఏ మాత్రం పొరపాట్లు దొర్లినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. మేడారం అభివృద్ధి పనులపై జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు.
రా తి పనులతో పాటు రహదారులు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, గద్దెల చుట్టూ భక్తుల రాకపోకలకు సంబంధించిన మార్గాలు, భక్తు లు వేచి చూసే ప్రదేశాలు ఇలా ప్రతి ఒక్క అంశంపైనా సీఎం అధికారులకు సూచనలు చేశారు. పనులు సాగుతున్న తీరుపై ప్రదర్శించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ను పరి శీలించిన సీఎం పలు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ఆర్ అ ండ్ బీ, విద్యుత్ శాఖ, దేవాదాయ శాఖ, అటవీ శాఖ, స్థపతి శివనాగిరెడ్డి సమన్వయ ంతో సాగాలని సీఎం సూచించారు.
అభివృద్ధి పనుల్లో ఆదివాసీ సంస్కృ తి, సంప్ర దాయాలు, ఆచారాలకు పెద్ద పీట వేయాల ని తెలిపారు. సమీక్షలో రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ర్ట షెడ్యూల్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ముఖ్యకార్యదర్శి కే.ఎస్. శ్రీనివాసరాజు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, ఆర్ అండ్ బీ ఈఎన్సీ మోహన్ నాయక్ పాల్గొన్నారు.