ఆహార భద్రత అధికారుల తనిఖీలు
21-07-2026 06:31 PM
నిర్మల్,(విజయక్రాంతి): వర్షాకాలం దృశ్యా అంటు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నందున ఈరోజు నిర్మల్ పట్టణంలో ఫుడ్ సేఫ్టీ, మున్సిపల్ అధికారులు పండ్ల షాపులు, హోటల్లు, స్వీట్ హోమ్ లలో తనిఖీలు నిర్వహించారు. పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలని, కల్తీ ఆహార దార్థాలు విక్రయిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఫుడ్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సునీత గారు, సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ మరియు ఫుడ్ సేఫ్టీ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు






