27-06-2025 01:34:53 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్26 (విజ య క్రాంతి): భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) అధికార ప్రతినిధి జగన్ పేరుతో గురువారం విడుదలైన లేఖ కలకలం రేపుతోంది. కుమ్రం భీం పేరుతో ఏర్పాటైన జిల్లా లో 339 గ్రామాల ప్రజలను ఖాళీ చేయించేందుకు ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 49 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అటవీ జంతువులను కాపాడుతూ జీవిస్తున్న ఆదివాసీలను అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రభుత్వాలు చూస్తున్నాయని ఆరోపించారు .ఆసిఫాబాద్ జిల్లానే లేకుండా చేయాలనే కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు..
లేఖలో ప్రధాన అంశాలు:-
ఆదివాసీ ప్రజల హక్కుల కోసం జల్, జంగల్, జమీన్ ఉద్యమానికి నాయకత్వం వహించి అమరజీవిగా ఆదివాసుల ఉద్యమ స్ఫూర్తిగా ఉన్న కొంరంభీం పేరుతో ఏర్పాటైన జిల్లాలోని సుమారు 339 గ్రామాలను, ప్రజలను ఖాళీ చేయించాలని తెచ్చిన జీ. వో. నెం. 49 తేదీ. 05.05.2025ని రద్దు చేయాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ జీవో ఉద్దేశ్యం జంతుపులుల కోసం కాదు అనేది వాస్తవం. ఇది మానవ పులులై న మోడీ, అమిత్ షా మానసపుత్రులైన అదానీ, అంబానీ, కార్పోరేట్ సంస్థల కోస మే అనేది అందరూ గమనించాలి.
వేల సం వత్సరాలుగా అడవిని, అడవిలోని అన్ని రకా ల జంతువులను కాపాడుతూ సహజీవనం చేస్తున్న మూలవాసులను అడవికి దూరం చేసి, వారి జీవనాన్ని, సంస్కృతి సాంప్రదాయాలను మరీ ముఖ్యంగా అటవీ సంపద ను కొల్లగొట్టడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలలో 3 జిల్లాలు పూర్తిగా కనుమరుగవుతాయి. కొమరంభీం జిల్లా, ములుగు జిల్లా, భద్రాద్రి జిల్లా లు తెలంగాణ చిత్రపటంలో ఇక కనపడవు.
తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాల్లో సుమారు 10 నియోజకవర్గాలు రానున్న రోజుల్లో వాటి ఊసే ఉండదు. భారతదేశంలోని మైదాన ప్రాంతాలు, చెరువులు, నదులు, కొండలు, గుట్టలు మెదలగు వాటిని సర్వనాశనం చేసిన దోపిడీదారులు ఇక భారత రాజ్యాంగంలోని 5, 6వ షెడ్యూ ల్ ప్రాంతాలను, సంపదను దొంగిలించడానికి పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నారు. ఇందు కోసం జంతు సంరక్షణ, పర్యావరణం పేర్ల తో ఈ దేశ మూలవాసులైన ఆదివాసులను అడవి నుండి వెల్లగొట్టడానికి పెద్ద ఎత్తున పోలీస్ బలగాలతో చిత్ర హింసలకు గురిచే స్తూ చంపుతున్నారు.
టైగర్ ఫారెస్ట్ కారిడార్ పేరుతో ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లోని సిర్పూర్ U, వాంకిడి, జైనూర్, కెరమెరి, ఆసిఫాబాద్, రెబ్బన, కాగజ్నగర్, నార్నూర్, సిర్పూర్ (T), చింతల మానపల్లి, గాజుగూడ, బెజ్జూర్, లింగాపూర్, పెంచికలపేట మొదలగు మండలాల ప్రజలను ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్న అన్ని రకాల ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
ఇప్పటికే ఈ అనాలోచిత నిర్ణయాల పట్ల ఐక్య రాజ్యసమితి నిపుణులు, మానవహక్కుల విభాగం భారత ప్రభుత్వానికి ఈ ప్ర యత్నాలు మానుకోవాలని విజ్ఞప్తి చేసింది. అడవిలోని సంపదకు, మొత్తం భూ భాగానికి హక్కుదారులు మూలవాసులైన ఆదివా సులేనని భారత రాజ్యాంగం చెప్తున్నది. ఐక్యరాజ్య సమితి కూడా ఇదే విషయాన్ని పదేప దే గుర్తు చేస్తున్నదని లేఖలో ప్రస్తావించారు.