27-06-2025 01:36:14 AM
ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సం స్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ అని ఎమ్మెల్యే ముఠా గోపా ల్ అన్నారు. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వివిధ అమ్మవారి దేవాలయాల నిర్వాహకులు బోనాలు నిధుల మంజురుకు దరఖాస్తులు అందించాలని ఎమ్మెల్యే ముఠా గోపా ల్ సూచించారు.
ఈ మేరకు గురు వారం గాంధీనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రతి సం వత్సరం బోనాలు సందర్భంగా రాష్ట్ర ప్రభు త్వం అమ్మవారి దేవాలయాలకు అలంకరణ, ఇతరత్రా అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేసే సం ప్రదాయా న్ని పాటిస్తోందని తెలిపారు.
ఆల యం లెటర్ హెడ్తో పాటు ఆలయం ఫొటో, ప్రెసిడెంట్, సెక్రటరీ ఆధార్ కార్డు జిరాక్స్, ఆలయం బ్యాంక్ అకౌంట్ వివరాలు అందజేయాలని సూచించారు. గత సంవత్సరం పొంది న చెక్కు జిరాక్స్ కాపీని కూడా అందించాలన్నారు. గాంధీనగర్లోని ఎమ్మె ల్యే కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఇతర వివరాల కో సం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముచ్చకుర్తి ప్రభాకర్ 9392222117కు సంప్రదించాలన్నారు.