25-11-2025 02:35:15 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ కామారెడ్డి జిల్లా మాజీ కార్యదర్శి, న్యాయవాది వీఎల్ నరసింహారెడ్డి సోమవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన కామారెడ్డి జిల్లాతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిరుపేదలు, కార్మిక వర్గం కోసం గత 40 ఏళ్లుగా నిరంతరం పోరాటాలు చేసిన చరిత్ర ఆయనది. అదేవిధంగా కార్మికుల హక్కుల కోసం, నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి చివరి శ్వాస వరకు అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొని నిస్వార్ధంగా పనిచేశారు. దీంతో కార్మిక లోకం ఆయన మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. కార్మికుల పక్షాన పోరాడటమే కాకుండా న్యాయవాదిగా ఆయన బడుగు బలహీనవర్గాలకు సేవలందించారు. వివిధ కార్మిక ఉద్యమాల్లో పాల్గొనడంతో పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కూడా ఆయన కీలకపాత్ర పోషించారు.