కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన మాజీ ఈఎన్సీ, సీడీవో మాజీ ఈఎన్సీ
హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ ఈఎన్సీ మురళీధర్, సీడీవో మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి గురువారం హాజరైయ్యారు. మురళీధర్, నరేందర్ రెడ్డిలను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. కమిషన్ ముందు కీలక అంశాలను నరేందర్ రెడ్డి ప్రస్తావించారు. ఈ సందర్భంగా డిజైన్లు, డ్రాయింగ్ లకు ఫైనల్ అప్రూవల్ కు మొదటగా సంతకం చేయలేదని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్, హరీశ్ రావు, ఉన్నతాధికారుల ఒత్తిడి వల్ల సంతకాలు చేశాన్నాని, త్వరగా చేయాలన్న ఒత్తిడి వల్ల హడావిడిగా అన్ని అప్రూవల్ చేశామన్నారు.
మేడిగడ్డ ప్రతి డిజైన్ లో సీడీవో పాటు ఎల్అండ్ టీ సంస్థ పాల్గొన్నదని, ప్రాజెక్టు నిర్మాణ సంబంధిత చర్చల్లో నేను పాల్గొన్నాలేదని నరేందర్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం జరిగేటప్పుడే తప్పిదాలు జరిగాయని తెలిపారు. ప్రభుత్వం ఒత్తిడి, అధికారుల నిర్లక్ష్యం వల్ల తప్పిదాలు జరిగాయని సీడీవో మాజీ ఈఎన్సీ వెల్లడించారు. పైనుంచి ఒత్తిడి వల్ల క్వాలిటీ కంట్రోల్ చెక్ సరిగా చేయలేదని ఆయన సూచించారు. బ్యారేజీల నిర్వహణ, గేట్ల ఆపరేషన్ సరిగా చేయలేదని సీడీవో మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.






