11-05-2025 06:31:59 PM
సారంగాపూర్,(విజయక్రాంతి): గత కొద్ది కాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతూ హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందతున్న వంజర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గోనె లస్మయ్య ఆదివారం మరణించారు. అంత్యక్రియల్లో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో పాటు మాజీ ఎంపీపీ అట్ల మహిపాల్ రెడ్డి, రైబాస జిల్లా అధ్యక్షుడు వెంకట్ రాం రెడ్డి,మాజీ సర్పంచులు,మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాధితుడికి ఒక భార్య,ఇద్దరు కుమారులు ఉన్నారు.