31-05-2025 10:19:39 PM
కొండపాక: శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు(Former Minister Tanniru Harish Rao) అన్నారు. కుకునూర్ పల్లి మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో పునర్నిర్మించిన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా శనివారం పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువతో సన్మానించి ఎల్లమ్మ తల్లి ప్రతిమను అందజేశారు. దర్శనానంతరం ఆయన మాట్లాడుతూ... గ్రామాల్లో నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రజల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందన్నారు.
ప్రతి ఒక్కరు మన సాంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలని కోరారు. అమ్మవారి కృపాకటాక్షాలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.బిఆర్ఎస్ హాయంలో ఈ ఎల్లమ్మ దేవాలయానికి 20 లక్షలు మంజూరు చెయ్యడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. గత ప్రభుత్వం గౌడ కులస్తుల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిందని రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గౌడ కులస్తుల అభ్యున్నతి విస్మరిస్తుందని అన్నారు.
కేసిఆర్ లేని లోటు రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుంది అని అన్నారు. అనంతరం గౌడ సంఘం సభ్యులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ దేవి రవీందర్, ఈజీఎస్ స్టేట్ కౌన్సిల్ మాజీ సభ్యురాలు కోల సద్గుణ రవీందర్, కొండపాక పిఎసిఎస్ చైర్మైన్ పిష్క అమరేందర్, కొండపాక మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్, మాజీ సర్పంచులు పూలోజి కిరణ్ కుమార్, బచ్తలి మహిపాల్, రెడ్డమైన కనకయ్య,బిఆర్ఎస్ పార్టీ నాయకులు మల్లం అయిలయ్య ,గౌటి సంపత్, కొంతం రాజు ,గౌడ సంఘం తదితరులు ఉన్నారు.