31-05-2025 10:21:38 PM
ఏరియా పీఎం శ్యాం సుందర్..
మందమర్రి (విజయక్రాంతి): సీఎంపీఎఫ్ ద్వారా పెన్షన్ పొందుతున్న రిటైర్డ్ సింగరేణి ఉద్యోగులు ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో జీవన్ ప్రమాణ్ సర్టిఫికెట్ విధిగా సీఎంపీఎఫ్ వారికి అందజేయాలని ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్(Area Personnel Manager S. Shyamsunder) తెలిపారు. సకాలంలో జీవన్ ప్రమాణ్ సర్టిఫికెట్ అందజేయని రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ జనవరి నెల నుండి నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు.
సీఎంపీఎఫ్ వారు పెన్షన్ పంపిణీ బాధ్యత దన్ బాద్ ఎస్బీఐ వారికి అప్పగించడం జరిగిందని, 2023 సంవత్సరం నుండి దేశ వ్యాప్తంగా సీఎంపీఎఫ్ పెన్షన్ పంపిణీ ఎస్బీఐ చేపట్టిందన్నారు. ఇటీవల చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు జీవన్ ప్రమాణ్ సర్టిఫికెట్ అందజేకపోవడం, సరైన సమాచారం లేకుండా ఇవ్వడం మూలంగా చాలా మంది పెన్షన్ పొందలేక పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రతి రిటైర్డ్ ఉద్యోగి నవంబర్ నెలలో తమకు సంబందించిన జీవన్ ప్రమాణ్ సర్టిఫికేట్ ను మీ సేవా కేంద్రాల్లో ఆన్లైన్ చేసి, సంబంధిత ఎస్బీఐ బ్యాంకు వారికి లేదా సీఎంపీఎఫ్ వారికి అందజేయాలని సూచించారు.