మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్
10-09-2025 10:38 PM
నాగారం: నాగారం మండలం మామిడిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కనుక యాగయ్య, పనిగిరి ఉప సర్పంచ్ ఎర్ర నరేష్ తండ్రి ఎల్లయ్య, బట్టు నగేష్ ఇటీవల మరణించడంతో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. కార్యకర్త కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు. ఆయన వెంట టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కల్లెట్లపెళ్లి ఉప్పలయ్య, రఘునందన్ రెడ్డి, చిల్లర చంద్రమౌళి సతీష్ , లాజర్, నాతి మహేష్, మహేందర్ చిరంజీవి, వెంకన్న అంజయ్య, యాదగిరి , రాములు రాజు తదితరులు పాల్గొన్నారు.






