23 May, 2026 | 6:43 PM

Breaking News

కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •   చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు   •   ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం   •   చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం   •   పేరు మార్పిడి చేసిన రెవెన్యూ ఉద్యోగిని సస్పెండ్ చేయాలి   •   జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఛైర్మెన్ గా దూమల రాజ్ కుమార్   •   తాడువాయిలో జీలుగ విత్తనాల పంపిణీ   •   రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా గడ్డం రాజశేఖర్ నియామకం   •   నందివాడలో ఉపాధి పనుల పరిశీలన   •  

నిష్ణాతులైన ఉపాధ్యాయులకు సన్మానం

10-09-2025 10:41 PM

మణుగూరు (విజయక్రాంతి): మున్సిపాలిటీ పరిధిలోని ఎక్స్లెంట్ హైస్కూల్ లో బుధవారం నిష్ణాతులైన, ఉపాధ్యాయులను మున్సిపల్ కమిషనర్ ప్రసాద్(Municipal Commissioner Prasad), సామాజిక కార్యకర్త, నాయ్యవాది కర్నేరవి శాలువాలతో ఘనంగా సత్కరించారు. కర్నె రవి మాట్లాడుతూ.. గురువు దీవెనల వల్లనే ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. దేశానికి మంచి పౌరులను అందించేది కేవలం ఉపాధ్యాయుడేనని తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయుడిగా ఉండి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారని, నవ సమాజ రూపశిల్పులు ఉపాధ్యాయులేనన్నారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ యూసఫ్, ఖాదర్, జబ్బర్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.