01-05-2025 06:43:59 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో బుధవారం 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో మండల టాపర్గా నిలిచిన కేజీబీవీ రాజంపేట పాఠశాల విద్యార్థిని గుర్రాల వర్షశ్రీ 552 మాజీ ఎంపీటీసీ ఆముదాల రమేష్ ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఒక అమ్మాయి ఈ విధంగా మంచి మార్కులతో మండలంలో టాపర్ కావడం గర్వకారణమని అన్నారు. ఆమెను చూసి ప్రతి విద్యార్థి ప్రేరణ పొందాలని, కృషితో పాటు పట్టుదల ఉంటే ఎలాంటి విజయమైనా సాధ్యమని తెలిపారు. పదవ తరగతి పరీక్షలు ప్రతి విద్యార్థికి భవిష్యత్కు కీలకమైన దశ అని పేర్కొన్నారు. ఈ తరహా సన్మానాలు విద్యార్థులలో మరింత ఉత్సాహం, విశ్వాసం కలిగిస్తాయని అన్నారు.