7 May, 2026 | 12:57 AM

విశ్రాంత గురువుకు ఆర్థిక సాయం అందించిన పూర్వవిద్యార్థులు

07-05-2026 12:25 AM

సుల్తానాబాద్, మే 6 (విజయ క్రాంతి):విశ్రాంత గురువు కు ఆర్థిక సాయం అందించిన 1985 - 86 పూర్వ విద్యార్థులు, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కు చెందిన ఎం. డి .వలియుద్దీన్ అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారన్న విషయము తెలుసుకున్న వారి శిష్యులు పోలాడి రామ్ గోపాల్. ఎన్ నారాయణ బాబు. జె. మల్లయ్య. డీలర్ అంజయ్య గౌడ్. ఆర్ స్వామి దాస్. గడ్డం అశోక్ రెడ్డి. పన్నాల రాములు. గడ్డం శ్రీనివాస్. దొడ్ల అంజనీ ప్రసాద్. పల్లెర్ల నరేందర్. మిట్టపల్లి రామకృష్ణ . పీవీ శ్రీనివాస్. కొమురవెల్లి అశోక్. కొమురవెల్లి భాస్కర్. ఎండి. ముజాహిద్. ఎండి. అలీ మహమ్మద్...

వారి పరిస్థితిని విని. వారి ఇంటి వద్దకు వెళ్లి వారిని పరామర్శించి ధైర్యం చెప్పి. వారికి అందరూ కలిసి 30 వేల రూపాయలు నగదును వారికి అందించారు, మేమందరం ఈ రోజు ఈ స్థాయిలో  ఉన్నామంటే అది మాకు చదువు చెప్పిన గురువులే కారణమని... గురువు కి ధైర్యం చెప్పారు ... ఈ సందర్భంగా వలి యుద్దీన్ సంతోషించి మీరందరూఆయురారోగ్యంగా ఉంటూ ఇంకా ఉన్నతమైనటు వంటి పదవులను అలంకరించాలని అన్ని రంగాలలో రాణించాలని అందరిని ఆశీర్వదించారు.