01-06-2025 08:47:08 PM
చేగుంట (విజయక్రాంతి): చేగుంట మండలం పెద్ద శివనూర్ గ్రామంలో జరిగే శ్రీ రేణుక ఎల్లమ్మ ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలకు హాజరుకావాలని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, ఆదివారం మెదక్ ఎంపీ రఘునందన్ రావు(Medak MP Raghunandan Rao)కు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో చేగుంట మండల వైస్ ప్రెసిడెంట్ మున్నూరు రామచంద్రం, బిజెపి చేగుంట మండల్ నాయకులు, గ్రామస్తులు, గౌడ సంఘం సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.